గుదిబండగా మారిన గుర్తింపు కార్డులు. చిక్కుల్లో 200 మంది తెలుగు ప్రజలు
- January 31, 2018_1517406302.jpg)
కువైట్:' దేవుడు ..వరమిస్తే ...పూజారి అడ్డం పడినట్లు ' .... క్షమాభిక్ష అంటూ కువైట్ ప్రభుత్వం కరుణిస్తే ... గుర్తింపు కార్డులంటూ రాయబార కార్యాలయం మోకాలు అడ్డం పెట్టింది. దాంతో తెలుగు రాష్ట్రాలలో కొందరు ప్రవాసీయులు తమ దురదృష్టానికి దుఃఖిస్తున్నారు. ఎట్టకేలకు ఏడేళ్ల తరువాత కువైట్ ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఖానూన్ ( ఆమ్నెస్టీ ) ప్రకటించింది. అరుదుగా లభ్యమయ్యే ఈ అపూర్వ అవకాశం కోసమే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రవాసీయులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రాయబార కార్యాలయం విధించిన నియమ నిబంధనలు కొందరికి శాపంగా మారేయి. దీంతో కొందరిలో క్షమాబిక్ష అవకాశం ఏమాత్రం సంతోషం కనిపించడం లేదు. సరైన గుర్తింపు కార్డులను చూపనివారి దరఖాస్తులను కువైత్ ఎంబసీలో అధికారులు నిర్దయగా పెదవి విరిచి తిరిగి ఇచ్చేయడంతో వందలాది మంది ఎంబసీ వద్ద దిగాలుగా కూర్చొని ఉన్నారు. పలు కారణాలతో పాస్పోర్టులు, అకామా (ప్రభుత్వం ఇచ్చే ధ్రువీకరణ పత్రం) లేని దాదాపు 200మంది తెలుగువారు కువైట్ లో చిక్కుల్లో పడ్డారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి