పీపాల కొద్ది ఆయిల్ . విధ్యుత్ తీగలను దొంగిలించిన నిందితులు అరెస్ట్
- January 31, 2018
కువైట్ : కుళాయి తిప్పుకొని దాహం తీర్చుకొన్నమాదిరిగా ..నూతులలో ఊరే ఆయిల్ గదా ..ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొద్దిగా తోడుకున్నామంతే అంటున్న కువైట్, సౌదీ దేశాలకు చెందిన ఇద్దరు నేరస్తులను కువైట్ అపరాధ పరిశోధకులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఘరానా దొంగలు చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఇనుప కంచెని కత్తిరించి లోపలకు దర్జాగా ప్రవేశించి ఆయిల్ బావిలో టిన్నుల కొద్ది పెట్రోల్ అపహరించడమే కాక అక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగిలించారు. ఆయిల్ బావులకు కలుపబడిన రెండు ముఖ్యమైన వైర్లను కత్తిరించి చమురు ఉత్పత్తిని నిలిచిపోయేలా చేశారు. ఈ దొంగ సొత్తును అంగారాలో విక్రయించడానికి బేరం పెట్టారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన క్రిమినల్ డిటెక్టివ్ లు వారి అనుమానపు తీరుని గమనించి పట్టుకొని నింధుతులిద్దరిని విచారణ చేయగా వారి దొంగతనం వెలుగు చూసింది . ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారువారు 27 కేబుల్స్ ను దొంగిలించి, అగార్సా చెత్త సామాను కొనుగోలు చేసే కేంద్రంలో ఇరానియన్లకు అమ్మివేశారు. ఈ ఇద్దరి దొంగతనంకారణంగా చమురుక్షేత్రంలో మూడు రోజుల పాటు ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ నష్టం విలువ 46,000 కువైట్ దినార్ల నష్టంగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు..నివాసితులకు అలెర్ట్ జారీ..!!
- నిరుద్యోగ యువతకు అలర్ట్..









