పీపాల కొద్ది ఆయిల్ . విధ్యుత్ తీగలను దొంగిలించిన నిందితులు అరెస్ట్
- January 31, 2018
కువైట్ : కుళాయి తిప్పుకొని దాహం తీర్చుకొన్నమాదిరిగా ..నూతులలో ఊరే ఆయిల్ గదా ..ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా కొద్దిగా తోడుకున్నామంతే అంటున్న కువైట్, సౌదీ దేశాలకు చెందిన ఇద్దరు నేరస్తులను కువైట్ అపరాధ పరిశోధకులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ ఘరానా దొంగలు చమురు ఉత్పత్తి చేసే ప్రాంతంలో ఇనుప కంచెని కత్తిరించి లోపలకు దర్జాగా ప్రవేశించి ఆయిల్ బావిలో టిన్నుల కొద్ది పెట్రోల్ అపహరించడమే కాక అక్కడ ఉన్న విద్యుత్ తీగలను సైతం దొంగిలించారు. ఆయిల్ బావులకు కలుపబడిన రెండు ముఖ్యమైన వైర్లను కత్తిరించి చమురు ఉత్పత్తిని నిలిచిపోయేలా చేశారు. ఈ దొంగ సొత్తును అంగారాలో విక్రయించడానికి బేరం పెట్టారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన క్రిమినల్ డిటెక్టివ్ లు వారి అనుమానపు తీరుని గమనించి పట్టుకొని నింధుతులిద్దరిని విచారణ చేయగా వారి దొంగతనం వెలుగు చూసింది . ఇద్దరూ తాము చేసిన నేరాన్ని అంగీకరించారువారు 27 కేబుల్స్ ను దొంగిలించి, అగార్సా చెత్త సామాను కొనుగోలు చేసే కేంద్రంలో ఇరానియన్లకు అమ్మివేశారు. ఈ ఇద్దరి దొంగతనంకారణంగా చమురుక్షేత్రంలో మూడు రోజుల పాటు ఆయిల్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆ నష్టం విలువ 46,000 కువైట్ దినార్ల నష్టంగా అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









