హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష
- January 31, 2018
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. 19 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. మరో 17 మంది నిందితులకు 15 ఏళ్ళ జైలు శిక్ష, 9 మందికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 11 మందికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా, ఇద్దరి నిర్దోషులుగా నిర్ధారించింది. 48 మంది నిందితుల పౌరసత్వాన్ని రద్దు చేసింది న్యాయస్థానం. 60 మంది నిందితులు, తీవ్రవాద సంస్థని ఏర్పాటు చేసి, తీవ్రవాద కార్యకలాపాల్ని చేపట్టారు. పేలుడు పదార్థాల్ని ఇంపోర్ట్ చేసుకుని, వాటి ద్వారా బాంబుల్ని తయారు చేసినట్లు విచారణలో తేలింది. జనవరి 1, 2017న నిందితులు ఓ పోలీస్ని చంపేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయడం, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగింది. మొత్తం 60 మంది నిందితులపైనా విచారణ జరిగింది.
తాజా వార్తలు
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







