హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష
- January 31, 2018
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. 19 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. మరో 17 మంది నిందితులకు 15 ఏళ్ళ జైలు శిక్ష, 9 మందికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 11 మందికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా, ఇద్దరి నిర్దోషులుగా నిర్ధారించింది. 48 మంది నిందితుల పౌరసత్వాన్ని రద్దు చేసింది న్యాయస్థానం. 60 మంది నిందితులు, తీవ్రవాద సంస్థని ఏర్పాటు చేసి, తీవ్రవాద కార్యకలాపాల్ని చేపట్టారు. పేలుడు పదార్థాల్ని ఇంపోర్ట్ చేసుకుని, వాటి ద్వారా బాంబుల్ని తయారు చేసినట్లు విచారణలో తేలింది. జనవరి 1, 2017న నిందితులు ఓ పోలీస్ని చంపేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయడం, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగింది. మొత్తం 60 మంది నిందితులపైనా విచారణ జరిగింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









