హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష

- January 31, 2018 , by Maagulf
హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష

మనామా: హై క్రిమినల్‌ కోర్టు, ఓ హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. 19 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. మరో 17 మంది నిందితులకు 15 ఏళ్ళ జైలు శిక్ష, 9 మందికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 11 మందికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా, ఇద్దరి నిర్దోషులుగా నిర్ధారించింది. 48 మంది నిందితుల పౌరసత్వాన్ని రద్దు చేసింది న్యాయస్థానం. 60 మంది నిందితులు, తీవ్రవాద సంస్థని ఏర్పాటు చేసి, తీవ్రవాద కార్యకలాపాల్ని చేపట్టారు. పేలుడు పదార్థాల్ని ఇంపోర్ట్‌ చేసుకుని, వాటి ద్వారా బాంబుల్ని తయారు చేసినట్లు విచారణలో తేలింది. జనవరి 1, 2017న నిందితులు ఓ పోలీస్‌ని చంపేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయడం, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగింది. మొత్తం 60 మంది నిందితులపైనా విచారణ జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com