జాతరకు సీఎం
- February 01, 2018
మేడారం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మేడారం మహాజాతర పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గం టలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరుతారు. 1.15గంటలకు మేడారంకు చేరుకుంటారు. 1.25గంటలకు మేడారం జాతర ప్రాంగణంలోని హెలీప్యాడ్లో దిగుతారు. 1.25గంట ల నుంచి 1.45గంటల వరకు జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని తల్లులకు కానుకగా ఇస్తారు. 2.10గంటలకు పోలీసు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.10గంటల నుంచి 3గంటల వరకు భోజనంచేసి విశ్రాంతి తీసుకుంటారు. 3.05గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణం అవుతారు. సీఎం రాక సందర్భంగా జాతర ప్రాం గణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









