జాతరకు సీఎం
- February 01, 2018
మేడారం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మేడారం మహాజాతర పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గం టలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్లో బయలుదేరుతారు. 1.15గంటలకు మేడారంకు చేరుకుంటారు. 1.25గంటలకు మేడారం జాతర ప్రాంగణంలోని హెలీప్యాడ్లో దిగుతారు. 1.25గంట ల నుంచి 1.45గంటల వరకు జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని తల్లులకు కానుకగా ఇస్తారు. 2.10గంటలకు పోలీసు క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 2.10గంటల నుంచి 3గంటల వరకు భోజనంచేసి విశ్రాంతి తీసుకుంటారు. 3.05గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణం అవుతారు. సీఎం రాక సందర్భంగా జాతర ప్రాం గణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







