జహ్రాలో ఒకరినొకరు తన్నుకున్న కార్ల తనిఖీ ఇన్ స్పెక్టర్లు
- February 01, 2018
కువైట్: పదిమందికి బుద్ధులు చెప్పాల్సిన వాహన తనిఖీ అధికారులు వానరులుగా మారి కీచులాడుకొని ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన జాహ్రా వాహనం సాంకేతిక తనిఖీ విభాగంలో బుధవారం జరిగింది. ఆ ఇన్ స్పెక్టర్లు ఉద్యోగాలు సంబంధించిన వివాదాలు కారణంగా మాత్రం వీరు తన్నుకోలేదుగానీ ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్నారు.. గోళ్ళతో రక్కుకొన్నారు...పెన్నులతో పొడుచుకొన్నారు..ఒక్కమాటలో చెప్పాలంటే వారు పనిచేస్తున్న కార్యాలయం వీరికి పోరాట వేదికగా మార్చేశారు . ఈ ముగ్గురిలో ఒకరు మాధకద్రవ్యాల ప్రభావంతో వింతగా ప్రవర్తించి తగాదా పడినట్లు అపరాధపరిశోధకులు వాకబు చేశారు, మరొక ఇన్ స్పెక్టర్లు ఇంటికి వెళ్లి గుర్తింపు కార్డుని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు ఆయన ఆ విధంగా అదృశ్యమైతే, మిగిలిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాదన తీవ్రమై ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. వారిలో ఒకరు సహచర ఉద్యోగిని పెన్నుతో పొడిచి గాయపరిచాడు. గాయపడిన ఇన్స్పెక్టర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. వీరి తగాదాపై డిటెక్టివ్ లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి