జహ్రాలో ఒకరినొకరు తన్నుకున్న కార్ల తనిఖీ ఇన్ స్పెక్టర్లు
- February 01, 2018
కువైట్: పదిమందికి బుద్ధులు చెప్పాల్సిన వాహన తనిఖీ అధికారులు వానరులుగా మారి కీచులాడుకొని ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన జాహ్రా వాహనం సాంకేతిక తనిఖీ విభాగంలో బుధవారం జరిగింది. ఆ ఇన్ స్పెక్టర్లు ఉద్యోగాలు సంబంధించిన వివాదాలు కారణంగా మాత్రం వీరు తన్నుకోలేదుగానీ ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్నారు.. గోళ్ళతో రక్కుకొన్నారు...పెన్నులతో పొడుచుకొన్నారు..ఒక్కమాటలో చెప్పాలంటే వారు పనిచేస్తున్న కార్యాలయం వీరికి పోరాట వేదికగా మార్చేశారు . ఈ ముగ్గురిలో ఒకరు మాధకద్రవ్యాల ప్రభావంతో వింతగా ప్రవర్తించి తగాదా పడినట్లు అపరాధపరిశోధకులు వాకబు చేశారు, మరొక ఇన్ స్పెక్టర్లు ఇంటికి వెళ్లి గుర్తింపు కార్డుని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు ఆయన ఆ విధంగా అదృశ్యమైతే, మిగిలిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాదన తీవ్రమై ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. వారిలో ఒకరు సహచర ఉద్యోగిని పెన్నుతో పొడిచి గాయపరిచాడు. గాయపడిన ఇన్స్పెక్టర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. వీరి తగాదాపై డిటెక్టివ్ లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
- తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్
- కేరళంలో షిగెల్లా వ్యాధి..
- నంది అవార్డుల పునరుద్ధరణపై మంత్రి కీలక ప్రకటన









