జహ్రాలో ఒకరినొకరు తన్నుకున్న కార్ల తనిఖీ ఇన్ స్పెక్టర్లు
- February 01, 2018
కువైట్: పదిమందికి బుద్ధులు చెప్పాల్సిన వాహన తనిఖీ అధికారులు వానరులుగా మారి కీచులాడుకొని ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన జాహ్రా వాహనం సాంకేతిక తనిఖీ విభాగంలో బుధవారం జరిగింది. ఆ ఇన్ స్పెక్టర్లు ఉద్యోగాలు సంబంధించిన వివాదాలు కారణంగా మాత్రం వీరు తన్నుకోలేదుగానీ ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్నారు.. గోళ్ళతో రక్కుకొన్నారు...పెన్నులతో పొడుచుకొన్నారు..ఒక్కమాటలో చెప్పాలంటే వారు పనిచేస్తున్న కార్యాలయం వీరికి పోరాట వేదికగా మార్చేశారు . ఈ ముగ్గురిలో ఒకరు మాధకద్రవ్యాల ప్రభావంతో వింతగా ప్రవర్తించి తగాదా పడినట్లు అపరాధపరిశోధకులు వాకబు చేశారు, మరొక ఇన్ స్పెక్టర్లు ఇంటికి వెళ్లి గుర్తింపు కార్డుని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు ఆయన ఆ విధంగా అదృశ్యమైతే, మిగిలిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాదన తీవ్రమై ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. వారిలో ఒకరు సహచర ఉద్యోగిని పెన్నుతో పొడిచి గాయపరిచాడు. గాయపడిన ఇన్స్పెక్టర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. వీరి తగాదాపై డిటెక్టివ్ లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం







