U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!

- February 03, 2018 , by Maagulf
U19 భారత్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా...!!

భారత్ క్రికెట్ అండర్ 19 ప్రపంచ కప్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ భారత యువ జట్టుకు బీసీసీఐ భారీ నజరాన ప్రకటించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అ న్ని విభాగాల్లో రాణించి చక్కని ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్ ను అందుకొన్నది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయ సాధించింది. జట్టులోని ఒక్కొక్క సభ్యుడికి రూ.30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ.20లక్షలు అందిస్తున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. సెమీఫైనల్ లో పాక్ పై భారత్ విజయం సాధించిన వెంటనే భారత యువ జట్టుకు నజరానా ఇస్తామని బీసీసీఐ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com