సరస్వతీ దేవికి తుది వీడ్కోలు:మెగాస్టార్
- February 03, 2018ప్రముఖ నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల (78) శనివారం హైదరాబాద్ లోని మణికొండలోని సొంత ఇంటిలో మరణించారు. ఆమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ సిటీలో లేనందున ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తనకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు తో అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. లక్ష్మీదేవి మృతి పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పేరు లక్ష్మీదేవి అయినా నా పాలిట.. సరస్వతీ దేవి. ఆ రోజు ఆమె చెప్పిన పాఠాలే నా పాఠవాలకు మూలం... ఆమె నాకు నటనలో నేర్పిన మెలకులవలే నాలోని నటుడికి మెలకువలు.. ఈ రోజు నేను ఎంతో మందికి అభిమాన హీరో అయినందుకు ఎంత సంతోషపడతానో... లక్ష్మీదేవి గారి శిష్యుడిని అని చెప్పుకోవడానికి అంత గర్వపడతాను. అటువంటి నా గురువు ఈ రోజు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం నాకు తీరని లోటు... తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి నటుడుకి లక్ష్మీదేవి మరణం ఎంతో బాధకలిగించే వార్త... బరువైన క్షణాలు.. అలా బరువెక్కిన నా హృదయంతో నా చదువులమ్మకి కన్నీటి తో తుది వీడ్కోలు పల్కుతున్నా..అని చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం