సరస్వతీ దేవికి తుది వీడ్కోలు:మెగాస్టార్
- February 03, 2018
ప్రముఖ నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల (78) శనివారం హైదరాబాద్ లోని మణికొండలోని సొంత ఇంటిలో మరణించారు. ఆమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ సిటీలో లేనందున ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తనకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు తో అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. లక్ష్మీదేవి మృతి పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పేరు లక్ష్మీదేవి అయినా నా పాలిట.. సరస్వతీ దేవి. ఆ రోజు ఆమె చెప్పిన పాఠాలే నా పాఠవాలకు మూలం... ఆమె నాకు నటనలో నేర్పిన మెలకులవలే నాలోని నటుడికి మెలకువలు.. ఈ రోజు నేను ఎంతో మందికి అభిమాన హీరో అయినందుకు ఎంత సంతోషపడతానో... లక్ష్మీదేవి గారి శిష్యుడిని అని చెప్పుకోవడానికి అంత గర్వపడతాను. అటువంటి నా గురువు ఈ రోజు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం నాకు తీరని లోటు... తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి నటుడుకి లక్ష్మీదేవి మరణం ఎంతో బాధకలిగించే వార్త... బరువైన క్షణాలు.. అలా బరువెక్కిన నా హృదయంతో నా చదువులమ్మకి కన్నీటి తో తుది వీడ్కోలు పల్కుతున్నా..అని చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









