సరస్వతీ దేవికి తుది వీడ్కోలు:మెగాస్టార్
- February 03, 2018ప్రముఖ నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల (78) శనివారం హైదరాబాద్ లోని మణికొండలోని సొంత ఇంటిలో మరణించారు. ఆమె మరణం తీరని లోటు అని సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి హైదరాబాద్ సిటీలో లేనందున ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. తనకు నటనలో ఓనమాలు దిద్దించిన గురువు తో అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకొన్నారు. లక్ష్మీదేవి మృతి పట్ల చిరంజీవి సంతాపం ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పేరు లక్ష్మీదేవి అయినా నా పాలిట.. సరస్వతీ దేవి. ఆ రోజు ఆమె చెప్పిన పాఠాలే నా పాఠవాలకు మూలం... ఆమె నాకు నటనలో నేర్పిన మెలకులవలే నాలోని నటుడికి మెలకువలు.. ఈ రోజు నేను ఎంతో మందికి అభిమాన హీరో అయినందుకు ఎంత సంతోషపడతానో... లక్ష్మీదేవి గారి శిష్యుడిని అని చెప్పుకోవడానికి అంత గర్వపడతాను. అటువంటి నా గురువు ఈ రోజు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడం నాకు తీరని లోటు... తెలుగు సినిమాతో ముడిపడి ఉన్న ప్రతి నటుడుకి లక్ష్మీదేవి మరణం ఎంతో బాధకలిగించే వార్త... బరువైన క్షణాలు.. అలా బరువెక్కిన నా హృదయంతో నా చదువులమ్మకి కన్నీటి తో తుది వీడ్కోలు పల్కుతున్నా..అని చిరంజీవి చెప్పారు.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం