ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలు చౌక అంటున్న సిన్హా

- February 04, 2018 , by Maagulf
ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలు చౌక అంటున్న సిన్హా

ఇండోర్‌ : దేశంలో కిలో మీటర్‌కు ఆటోలో ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌకగా మారిందని పౌర విమానాల సహాయక మంత్రి జయంత్‌ సిన్హా పేర్కొన్నారు. 27వ ఇండోర్‌ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో విమానాల చార్జీలు, ఆటోరిక్షాల చార్జీల కంటే తక్కువగా ఉన్నాయని, తాను తప్పుగా మాట్లాడటం లేదని, ఇది నిజం అని ప్రసంగించారు. ఇండోర్‌ నుండి ఢిల్లీకి విమాన ప్రయాణానికి కిలో మీటర్‌కు రూ.5 ఖర్చు పెడుతున్నారని, అదే ఆటోలో వెళితే కిలోమీటర్‌కు 5 నుండి 8 రూపాయలను ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. తక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నందున ఎక్కువ మంది విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com