అమెరికాలో బిజీ బిజీ నారా లోకేష్

- February 04, 2018 , by Maagulf
అమెరికాలో బిజీ బిజీ నారా లోకేష్

నవ్యాంధ్రలో పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా ఏపీ మంత్రి నారా లోకేష్ జరుపుతున్న పర్యటన బిజీబిజీగా సాగుతోంది. అట్లాంటాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమావేశమైన ఆయన,,అనంతరం ఎన్నారైలతో భేటీ అయ్యారు. కార్డ్ టెక్స్ కంపెనీ ప్రతినిధులతో ఆయన జరిపిన చర్చలు ఫల ప్రదమయ్యాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వెంటనే విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు. అటు-ఈ-ప్రగతి ప్లాట్ ఫాం ద్వారా ప్రభుత్వ సమాచారాన్ని ఒకే వేదికపైకి తెచ్చే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేస్తున్నట్టి లోకేష్ తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం ఉందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com