తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటాం : టర్కీ ఆర్మీ

- February 04, 2018 , by Maagulf
తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటాం : టర్కీ ఆర్మీ

అంకారా: సిరియాలో మోహరించిన తమ సైనికులపై మెరుపుదాడికి పాల్పడ్డ కుర్దు తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ పేర్కొన్నది. కుర్దు తిరుగుబాటుదారుల శిబిరాలను ధ్వంసం చేయనున్నట్టు ప్రకటించింది. టర్కీ ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆఫ్రిన్‌ నగరానికి సమీపంలో ఉన్న షేక్‌ హరూజ్‌ నగరంలో కుర్దు తిరుగుబాటుదారులు ఆదివారం బీభత్సం సృష్టించారు. టర్కీ సైనికుల యుద్ధ ట్యాంక్‌పై వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారదు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిమ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com