ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన రూ. 17.45 కోట్లు

- February 05, 2018 , by Maagulf
ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన  రూ. 17.45 కోట్లు

అబుదాబి : ఎడారిలో ఒయాసిస్సు ఎలా ఊరట ఇస్తుందో ...అధేవిధంగా పిల్లాపాపలను వదిలి ఎడారి దేశాలకు బతుకుజీవుడా అని వెళ్లిన ప్రవాసియలను పలు లాటరీలు వారి జీవితంపై పన్నీటి జల్లు కురిపిస్తున్నాయి.    అదృష్టం అనేది అత్యధికులకు కుంటుతూ అత్యంత నెమ్మదిగా వస్తుంది.కానీ అతి తక్కువమందికి అదే అదృష్టం ఆఘమేఘాలపై వస్తుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న కేరళకు చెందిన  ఓ భారతీయుడికి అబుదాబిలో నిర్వహించే ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ స్వంతమైంది. దీంతో ఆ వ్యక్తికి రూ. 17.45 కోట్లు దక్కింది. సునిల్ మప్పట్ట కుట్టీ నాయర్ అనే లక్ష్మీ పుత్రుడు ప్రస్తుతం భారత్‌కు వస్తున్నాడని ‘‘బిగ్ టికెట్ డ్రా’’ నిర్వహకులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాది ‘‘ ది బిగ్ టెన్ సిరీస్ 188’’లో అబుదాబిలో ప్రకటించిన లక్కీ డ్రాల్లో ఇది రెండవ అతిపెద్ద డ్రా.  గత నెలలో భారత్‌కు చెందిన దుబాయ్‌లో అజ్మాన్ ప్రాంతంలో నివాసముండే హరిక్రిష్ణన్ నాయర్ అనే వ్యక్తికి 12 మిలియన్ దిర్హమ్‌ల భారీ లక్కీ డ్రా వరించిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com