సలాలాలో షోరూమ్ ను ప్రారంభిన జోయాలుక్కాస్
- February 05, 2018
మస్కట్ : స్వర్ణకార ప్రపంచంలోనే అరుదైన ఆభరణాలు విక్రయించే జాయ్ లుక్కాస్ అభివృద్ధి చెందుతున్న సలలాహ్ నగరంలో కళ్ళు మిరుమిట్లు గొల్పే ఆకృతులలో తన తాజా షోరూంను సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ప్రపంచంలోని ఆభరణాలను భారీగా విక్రయించే గొలుసుకట్టు దుకాణాలతో ప్రపంచ విస్తరణ పథకాలలో ఉత్సాహంగా కొనసాగుతుంది. ఈ షోహామ్ ను అల్ హద్దద్ క్లబ్ ఛైర్మన్ నజార్ అహ్మద్ అల్ మర్హూన్ ప్రారంభించారు. ఆయనతో పాటు ఇండియన్ సోషల్ క్లబ్ చైర్మన్ మన్ప్రీత్ సింగ్, జాయలుక్కాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పాల్ అల్లుకాస్,జాయలుక్కాస్ గ్రూప్ యొక్క విలీన ముఖ్యులు,వి ఐ పి లు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు ఉన్నారు.బంగారు, వజ్రం, రాళ్లు పొదిగిన నగలు, ముత్యాలు, విలువైన ఒక లక్షకు పైగా వివిధ రూపకల్పనల ప్రపంచ శ్రేణి ఎంపిక బ్రాండ్ ఆభరణాలను ఈ షోరూంలో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రకాశవంతమైన, విశాలమైన ఆధునిక సౌకర్యాలతో వివిధరకాలైన ఆభరణాల డిజైన్ల బహిరంగ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటైంది. ద్వితీయ రకమైన అమూల్యమైన పొదగబడిన రాళ్లతో రూపొందిన ఆభరణాలు. 2018 మొదటి త్రైమాసికంలో జయోలక్కాస్ షోరూంలలో కొత్త బంగారం, డైమండ్ జ్యుయలరీని ప్రదర్శిస్తుంది. జోయాలుక్కాస్ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ మాట్లాడుతూ, " సుందరమైన సలలాహ్ నగరంలో మా ఉనికి ద్వారా ఆభరణాల ప్రదర్శనశాలకు ఖచ్చితమైన నేపథ్యం ఉంది. మా తాజా షోరూమ్ ను ఇక్కడ తెరవడం మాకు ఎంతో సంతోషాన్నికల్గిస్తోంది. ఈ అవకాశాన్నీ కలిగించినందుకు కృతజ్ఞతలు చెప్పటానికి ఒమన్ ప్రజల మద్దతు మాకు ఉంది. ఈ అద్భుతమైన ఆభరణాల ప్రదర్శన దేశంలో ఏర్పాటుచేస్తూ ముందుకు కొనసాగుతున్నాం మరియు జ్యూయలరీ షాపింగ్ లో జాయ్ లుక్కాస్ మాత్రమే నివాసితులకు మరియు సందర్శకులకు వారికి నచ్చిన ఆభరణాలను మా షోరూమ్ లు ఖచ్చితంగా అందించగలవు. "జోయాలుక్కాస్ సలలాహ్ నగరంలో సంప్రదాయ,జాతి సమకాలీన మరియు అంతర్జాతీయ ప్రభావాలను మిళితం కాబడిన నగల నమూనాలను ఇక్కడ ప్రదర్శించబడతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి