విశాఖలో సందడి చేసిన తరుణ్
- February 05, 2018
కొమ్మాది, న్యూస్టుడే: తన మొదటి సినిమా నుంచి విశాఖతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు హీరో తరుణ్. తన కొత్త చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ' విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకొస్తోందని చెప్పారు. రామ్ ఎంటర్ట్రైనర్స్, అభిరామ్ బ్యానర్పై నిర్మించిన 'ఇది నా లవ్స్టోరీ' యూనిట్ సోమవారం కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించింది. తరుణ్ మాట్లాడుతూ యువత కోసమే తీసిన ఈ చిత్రాన్ని రమేష్గోపి దర్శకత్వంలో ఈ నెల 14న (ప్రేమికుల దినోత్సవం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు. దీనిని విజయవంతం చేయాలన్నారు. తరుణ్ విద్యార్థులతో సెల్ఫీలు తీసుకుని వారిని మరింత ఉత్సాహపరిచారు. దర్శకులు రమేష్గోపి, కళాశాల ఎఫ్డీ మురళీకృష్ణంరాజు, సీఏవో ఎస్ఎస్వర్మ, ఏజీఎం రామరాజు, శ్రీచైతన్య ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎన్.వి.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి