భర్త అపరిశుభ్రత: విడాకులు కోరిన భార్య
- February 07, 2018
యు.ఏ.ఈ:వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమన్న విషయాన్ని తెలియజేస్తూ ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించని ఓ భర్త నుంచి తనకు విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఓ మహిళ. తన భర్త తన మీదే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాడనీ, అతన్ని పరిశుభ్రంగా వుండమని మాత్రమే తాను కోరుతున్నప్పటికీ అతనుపట్టించుకోవడంలేదని ఆ మహిళ ఆరోపించింది. లీగల్ అడ్వయిజర్ మొహమ్మద్ సుహాద్ అహ్మద్ మాట్లాడుతూ, తమ భర్తల నుంచి విడిపోయి, మంచి జీవితం కోసం ప్రయత్నించాలనుకుంటున్నారనీ, ఇలాంటి కేసులు ఇటీవల పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల విషయంలో ముందుగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవానికి కుటుంబ సభ్యులే ఈ పని ముందుగా చేయాల్సి ఉంటుంది. బంధువుల కౌన్సిలింగ్కిగానీ, పోలీసులు - న్యాయ సలహాదారుల కౌన్సిలింగ్కిగానీ కలతలు తగ్గని పక్షంలో విడాకుల అంశం ముందుకు సాగే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









