విజయవాడ చేరుకున్న చంద్రబాబు

- February 08, 2018 , by Maagulf
విజయవాడ చేరుకున్న చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఆయన నిన్న దుబాయ్ వెళ్లారు. కాగా... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే... దుబాయ్‌లో ఉన్న చంద్రబాబు అక్కడినుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. కాగా... ప్రస్తుతం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు ఈరోజు కూడా ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విభజన హామీలపై రెండు రోజులుగా అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలు ఏమాత్రం మేలు చేసేలా లేకపోవడంతో పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com