ఓ మహిళ..ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన నలుగురు పాకిస్తానీ నిందితులకు శిరచ్చేదనం
- February 09, 2018
సౌదీఅరేబియా: ' కంటికి కన్ను ..పంటికి పన్ను ' అనే రీతిలో న్యాయం ఆ దేశాలలో ఖచ్చితంగా అమలవుతుంది కనుక ఏమైనా దారుణాలకు పాల్పడాలంటే నేరస్థులు గజ గజ వణికిపోతారు. ఎంతటి అకృత్యమైన కాసులు వెదజల్లి సులువుగా తప్పించుకోవడం అలవాటైపోయిన దేశాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన కొందరు తమ తమ వికృత నైజాలను చూపి ఆ తదుపరి ఆ దేశంలో అమలయ్యే శిక్షలకు బలైపోతుంటారు. ఓ మహిళ .ఆమె కుమారుడిపై లైంగికదాడికి పాల్పడిన గురువారం నలుగురు పాకిస్తానీ నిందితులకు అధికారులు శిరచ్చేదనం ద్వారా మరణశిక్ష అమలు చేశారు. ఆ నేరస్థులు ఒక మహిళపై అత్యాచారం చేసి చంపేశారు. ఆమె కొడుకుపై సైతం అసహజ రీతిలో లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. ఇంట్లో చొరబడి మహిళను బంధించి ముందుగా విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత ఆమెపై నలుగురు లైంగికదాడి చేశారన్నారు. చివరికి ఆమె కొడుకుపై కూడా లైంగికదాడి చేసినట్లు ఆధారాలు దొరికాయని వారు తెలిపారు. చనిపోయిన మహిళ కొడుకు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ నేరస్థులను సీసీ కెమెరా ఫుటేజీ సాయంతో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వారిని న్యాయస్థానం ఎదుట హజరుపరచగా .కోర్టు వారికి భూమిపై జీవించే హక్కు లేదని తీర్పు ఇచ్చింది. 2018 లో కనీసం రెండు నెలలు పూర్తికాక ముందే ఇప్పటివరకు మొత్తం 20 మందికి సౌదీ న్యాయస్థానం మరణశిక్ష విధించినట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









