భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ-2021
- February 10, 2018
దుబాయ్: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. కానీ, ఇందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు. 2021లో భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది ఐసీసీ.
2016లో టీ20 ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు పన్ను మినహాయింపు ఇవ్వలేదట. దీంతో ఐసీసీ నిర్వాహకులు 'భారత్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే మాకు పన్ను మినహాయింపు కావాలి అని కోరుతున్నారట. ఎందుకంటే మాకు టోర్నీ నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో పన్ను మినహాయింపు మాకు కాస్త ఊరట ఇచ్చే అంశం' అని తెలిపారు.
దీనిపై ఇప్పటికే బీసీసీఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రీడలను జీవితంలో భాగం చేసుకోమని పిలుపునిచ్చిన ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







