భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ-2021

- February 10, 2018 , by Maagulf
భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ-2021

దుబాయ్‌: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైంది. కానీ, ఇందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు. 2021లో భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించాలంటే పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది ఐసీసీ.

2016లో టీ20 ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టోర్నీ నిర్వహణకు పన్ను మినహాయింపు ఇవ్వలేదట. దీంతో ఐసీసీ నిర్వాహకులు 'భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే మాకు పన్ను మినహాయింపు కావాలి అని కోరుతున్నారట. ఎందుకంటే మాకు టోర్నీ నిర్వహించడానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో పన్ను మినహాయింపు మాకు కాస్త ఊరట ఇచ్చే అంశం' అని తెలిపారు.

దీనిపై ఇప్పటికే బీసీసీఐ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రీడలను జీవితంలో భాగం చేసుకోమని పిలుపునిచ్చిన ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com