అఖిల్ సినిమాని నిర్మిస్తున్న రానా
- February 10, 2018
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్గా పాపులర్ అందుకున్న రానా ప్రస్తుతం బహుబాషా నటుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగాను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రీసెంట్గా సురేష్ మూవీ ప్రొడక్షన్స్లో ఓ సినిమాను నిర్మించాడు రానా. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శీరత్ కపూర్, శ్రద్ధ శ్రీనాథ్, షాలినీ హీరోయిన్లుగా నటించారు. క్షణం సినిమాతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ ఇటీవల హలో సినిమాతో అలరించాడు. సినిమా హిట్ టాక్ సాధించినప్పటికి కలెక్షన్స్ విషయంలో కాస్త డల్గానే సాగింది. ఈ నేపథ్యంలో తన మూడో సినిమాని రంగస్థలం డైరెక్టర్ సుకుమార్తో చేయాలని భావిస్తున్నాడట. నాలుగో సినిమాని తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి తెరకెక్కించనున్నట్టు టాక్. ఈ రెండు సినిమాలని రానా తన ప్రొడక్షన్లో నిర్మించాలని భావిస్తున్నట్టు టాక్. తన తండ్రి సురేష్ బాబుతో చర్చలు జరిపిన తర్వాత రానా దీనిపై పూర్తి నిర్ణయానికి వస్తాడట .
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







