మయన్మార్‌లో ప్రమాదకర స్థాయిలో హింస

- February 10, 2018 , by Maagulf
మయన్మార్‌లో ప్రమాదకర స్థాయిలో హింస

మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింస ప్రమాదకరస్థాయిలో వుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్‌లో కొనసాగుతున్న హింసాకాండపై ఒక మీడియా సంస్థ దర్యాప్తు చేసిన వార్తా కథనంపై స్పందించిన ప్రపంచ సంస్థ ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై కొనసాగుతున్న హింసాకాండ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం వుందని అన్నారు. మయన్మార్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన ఇద్దరు జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ డిమాండ్‌ చేశారని, వారిని విడుదల చేసే వరకూ తాము మయన్మార్‌పై వత్తిడి కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com