తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు

- February 11, 2018 , by Maagulf
తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైం అఛీవ్‌మెంట్ అవార్డు

చెన్నైః తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ప్రదానోత్సవం ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరంలో సంగీత, సాహిత్యాన్ని ఎలా ప్రొత్సహించారో. అలాగే మనం కూడా ప్రజా జీవితంలో వాటిపై దృష్టిపెడితే మరింతగా పరిపక్వత చెందే వ్యక్తిత్వం పిల్లలకు అలవడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మధ్య వీటిపై దృష్టి పెట్టారని అన్నారు. మన భాషను కాపాడుకుందామని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృబాషను మరిచిపోవద్దని వెంకయ్య సూచించారు. 'అమ్మ భాష కళ్ల లాంటిది.. పరాయి భాష కళ్లద్దాలాంటిది'అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com