దుబాయ్ ఓపెరా లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
- February 11, 2018
దుబాయ్:భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన దుబాయ్కు చేరుకున్నారు. ముందు ఆయన అరబ్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఓపెరా హౌస్కు చేరుకున్న అనంతరం ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అరబ్, భారత్కు మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధం కాదని, ఇదొక భాగస్వామ్యమని పేర్కొన్నారు. భారత్ నుండి వచ్చి గల్ఫ్లో స్థిరపడిన 30 లక్షల మందికి తమ మాతృభూమి వాతావరణాన్ని కల్పించారని, దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ తన ఖ్యాతిని ఇనుమడింపజేస్తోందన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారత ప్రజల తరఫున తాను క్రౌన్ ప్రిన్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని, దీని నిర్మాణంతో ప్రపంచ ప్రజలకు వసుదైక కుటుంబం అనే సందేశాన్నిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుల్లో భారత్ 142నుండి 100కు చేరుకుందని, మరింత మెరుగుపడేందుకు కృషిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!