మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్గా రీతూ రావు
- February 12, 2018ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 ఫినాలే ఈవెంట్ ఘనంగా జరిగింది. మహా కవి కాళిదాసు ఆడిటోరియం ములుంద్లో ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రీతూ రావు పాటిబండ్ల టాప్ 3 కంటెస్టెంట్స్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. టీన్ కేటగిరీలో ఆమెకు ఫస్ట్ రన్నరప్గా ఛాన్స్ దక్కింది. అలాగే రీతూరావు 'మిస్ తియారా ఇండియా బ్యూటీ విత్ పర్పస్' టైటిల్ కూడా సొంతం చేసుకుంది. విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. చైల్డ్ ఎబ్యూజ్, సెక్సువల్ హెరాష్మెంట్, స్లేవరీ, ఈక్వాలిటీ, యాసిడ్ ఎటాక్స్ వంటి విషయాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. ఈ కారణంగానే ఆమెకు 'బ్యూటీ విత్ పర్సస్' టైటిల్ దక్కింది. షిబానీ కశ్యప్ సాంగ్స్ ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరాస్ తోమర్, సిమ్రాన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం