ఉల్లంఘన: 562,961 మంది వలసదారుల అరెస్ట్
- February 13, 2018
రియాద్: మొత్తం 562,691 మంది వలసదారుల్ని గత ఏడాది నవంబర్ 1 నుంచి ఇప్పటిదాకా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సౌదీ లేబర్ మరియు రెసిడెన్సీ అలాగే బోర్డర్ సెక్యూరిటీ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను వీరిని అరెస్ట్ చేశారు. 'ఎ నేషన్ వితౌట్ వయొలేటర్స్' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన క్యాంపెయిన్లో ఉల్లంఘనుల్ని గుర్తించి, అరెస్ట్ చేశారు. ఇందులో 382,921 మంది వద్ద చెల్లుబాటయ్యే రెసిడెన్సీ పర్మిట్ లేదు. 127,566 మంది వద్ద సరైన వర్క్ పర్మిట్ లేదు. 62,204 మంది బోర్డర్ సెక్యూరిటీ సిస్టమ్కి సంబంధించిన ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అక్రమంగా సౌదీలోకి ప్రవేశించేందుకు యత్నించిన 7,996 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 69 శాతం యెమనీయులు ఉండగా, 29 మంది ఇథియోపియన్స్ ఉన్నారు. 2 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారున్నారు. కింగ్డమ్ నుంచి పారిపోయేందుకు యత్నించిన 501 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారే అనేకరకాలైన నేరాలకు పాల్పడుతున్నట్లు రియాద్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







