విదేశాల్లో భారీ సెట్స్ మధ్య మహేష్ ఇంట్రో సాంగ్..
- February 13, 2018మహేశ్ బాబు, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' చిత్రం చిత్రీకరణ చివరి దశకి చేరింది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మినహా చిత్రం టాకీ పార్ట్ పూర్తయిపోయిందట. ప్రస్తుతం ఈ పాట కోసం చిత్ర బృందం విదేశాల్లోని లొకేషన్స్ వేటలో పడింది.
'బ్రహ్మోత్సవం, స్పైడర్' చిత్రాలతో అభిమానుల్ని పూర్తిగా నిరాశ పరచిన మహేశ్ బాబు.. తదుపరి చిత్రం 'భరత్ అనే నేను' మూవీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యువ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తహతహలాడుతున్న మహేశ్ ఈ చిత్రాన్ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కు తీసుకొచ్చాడు. ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'భరత్ అనే నేను' చిత్ర బృందం.. ఈ సినిమా కోసం కేవలం ఒకే ఒక పాటను బ్యాలెన్స్ ఉంచారు. అది కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఈ పాటను లండన్లో అందమైన లొకేషన్స్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ . యూకేలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక పూర్తయిందని.. త్వరలోనే మహేశ్ అండ్ టీం లండన్ బయల్దేరనున్నారని తెలుస్తోంది. ఈ పాట ఒక్కటి కంప్లీట్ చేస్తే.. ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టేనని అంటున్నారు.
ప్రస్తుతం 'భరత్ అనే నేను' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో మహేశ్ బాబు చురుగ్గా పాల్గొంటూ చిత్ర బృందాన్ని ఉత్తేజ పరుస్తున్నాడట. మార్చికల్లా చిత్రాన్ని ఫినిష్ చేసి రిలీజ్ డేట్ వరకూ ప్రచారాన్ని ముమ్మరం చేయనుందట చిత్ర బృందం. ఈ సినిమాపై ఫుల్ కాన్సిడెన్స్గా ఉన్న మహేశ్ బాబు.. మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడనే అభిప్రాయంతో ఉన్నారు అభిమానులు. మరి ముఖ్యమంత్రి భరత్గా మహేశ్ బాబు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం