కుంతియా నాయకత్వంలో కువైట్ కు బృందం
- February 13, 2018కువైట్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి ఎఐసిసి, ఐఎన్టియుసి, టిపిసిసి-గల్ఫ్ ఎన్నారై విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతోకూడిన ప్రతినిధి బృందం *ఈనెల 14 నుండి 17 వరకు* కువైట్ లో పర్యటించనుంది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, ఐఎన్టియుసి జాతీయ ఉపాధ్యక్షులు *రామచంద్ర కుంతియా* నాయకత్వంలోని ప్రతినిధి బృందం కువైట్ దేశంలో పర్యటించి కష్టాల్లో ఉన్న భారతీయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. ఈ బృందంలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టిపిసిసి-గల్ఫ్ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ *నంగి దేవేందర్ రెడ్డి*, జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు *డా. జెఎన్ వెంకట్*, మరికొందరు ప్రవాసి కార్మిక నాయకులు ఉన్నారు.
కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుండి ఫిబ్రవరి 22 వరకు *ఆమ్నెస్టీ (క్షమాబిక్ష)* ప్రకటించిన విషయం తెలిసిందే. ఇమిగ్రేషన్, నివాస చట్టాలను ఉల్లంఘించిన వారు ఎలాంటి జరిమానా, జైలు శిక్ష లేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పించారు. క్షమాబిక్ష పథకంలో కువైట్ లోని సుమారు 30 వేలమంది భారతీయ కార్మికులు స్వదేశానికి రావడానికి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వీరిలో 5 వేల మంది తెలంగాణ వలస కార్మికులున్నారు. *కువైట్ లో ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసి కార్మికులు తన వాట్సప్ నెంబర్ +91 90000 95360 కు సంప్రదించవచ్చని నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు.*
ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మాపై స్వరాజ్ కు లేఖలు రాశామని, కువైట్ కు ప్రత్యేక అధికార బృందాన్ని పంపాలని, ఎన్నారై పాలసీని ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు లేఖ రాశామని నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. సమస్య తీవ్రత దృష్ట్యా కువైట్ క్షమాబిక్ష విషయాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రస్తావించాలని ప్రతిపక్ష నాయకులను కోరామని అన్నారు.
*భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి*
* కువైట్ లోని ఇండియన్ ఎంబసీ లో ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల (అవుట్ పాస్) జారీ గురించి పెరిగిన రద్దీని తట్టుకోవడానికి అదనపు సిబ్బందిని నియమించాలని విదేశాంగ శాఖ కు విజ్ఞప్తి.
* భారత ప్రభుత్వం ఏర్ లైన్స్ (విమానయాన సంస్థలు) తో సంప్రదింపులు జరిపి విమాన చార్జీలు సరసంగా ఉండేవిధంగా చూడాలి. ప్రయాణ రాయితీని కూడా కల్పించాలి.
*తెలంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి*
* క్షమాబిక్ష పథకంలో వాపస్ రావాలనుకునే కోరుతున్న ప్రవాసులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వాలి
* కష్టాల్లో ఉన్న ప్రవాసులను ఆదుకోవడానికి కువైట్ కు ప్రతినిధి బృందాన్ని పంపాలి
* కువైట్ నుండి వాపస్ వచ్చిన ప్రవాసీ కార్మికులను ఆదుకోవడానికి వారు జీవితంలో స్థిరపడటానికి పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి
*ఇట్లు: నంగి దేవేందర్ రెడ్డి*
మొబైల్: +91 81435 88886
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం