డిగ్రీ చేసిన విద్యార్థులకు ఈ కోర్స్తో మంచి భవిష్యత్
- February 14, 2018
కొంతమంది యువత కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్ చేస్తే జాబ్ రాదు. వీళ్లు ఏదైనా కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి కొన్ని కోర్సులు బాగా ఉపయోగపడతాయి. అందులో ఎథికల్ హ్యాకింగ్ మొదటిది. హ్యాకింగ్ అంటే అనుమతి లేకుండా మన ఎలక్ట్రానిక్ పరికరాల్లోకి (కంప్యూటర్లు) ప్రవేశించడం. మన ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించిన వారిని దొంగలు అని ఎలా అంటామో వీరు కూడా అంతే. హ్యాకర్ అనే పదం 1980ల్లో మొదటిసారి వాడుకలోకి వచ్చింది. ఈ పదానికి వేర్వేరు అర్థాలున్నప్పటికీ ప్రధానంగా హ్యాకింగ్ అనే అర్ధంతోనే ప్రపంచానికి తెలుసు. ఈ ప్రమాదాన్ని కట్టడి చేసే పనినే ఎథికల్ హ్యాకింగ్ అని పిలుస్తారు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఎథికల్ హ్యాకింగ్ ఎక్సపర్ట్ లు అవసరముంది. వీరు ఎక్కువగా సంస్థల కోసం పని చేస్తారు. తాము పని చేసే సంస్థల ఆన్లైన్ భద్రతను పరీక్షిస్తారు. తమ సంస్థల వెబ్సైట్లను తామే హ్యాక్ చేస్తారు. తద్వారా కంపెనీల ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడమే వీరి పనిగా ఉంటుంది.
అయితే ఈ టెక్నాలజీ ని నేర్చుకోవడానికి ఎక్కువగానే సమయాన్ని వెచ్చించాలంటున్నారు సాఫ్ట్ వేర్ నిపుణులు.. ఈ క్రమంలో నేర్చుకున్నాక వచ్చే ప్రయోజనాలు కూడా భారీగానే ఉంటాయని చెబుతున్నారు. ఒక్కోదేశంలో వివిధ కంపెనీలకు వందల్లో ఎథికల్ హ్యాకింగ్ ఎక్స్పర్ట్ లు అవసరంగా టెకీలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కష్టమనో లేక ఖర్చుకు వెనుకాడో భారతదేశంలో ఆ కోర్సులు చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. అయితే కాస్తంత ఓపిక తెచ్చుకుని ఈ కోర్సును నేర్చుకుంటే భవిష్యత్ బంగారమే అంటున్నారు.. సో.. డిగ్రీ చేసి జాబ్ చేయాలనుకునే వారికి ఈ కోర్స్ మంచి అవకాశమని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి