18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం

- February 14, 2018 , by Maagulf
18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: అటవీ సిబ్బందికి వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన కామినేని కొణిదల, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సీఓఓ కరణ్‌భల్లా తెలిపారు. ఫిలింనగర్‌ అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన, కరణ్‌భల్లా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం ఉపాసన మీడియాతో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇటీవలే నల్లమల అడవుల్లో శిబిరాలు నిర్వహించామనీ, పదకొండు మంది మధుమేహ రోగులను గుర్తించామన్నారు. వారందరికీ అపోలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా 18 రాష్ట్రాల్లోని అటవీ గార్డులకు వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిర్ధరణ చికిత్స సేవలను అందిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com