18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం
- February 14, 2018
ఫిలింనగర్, న్యూస్టుడే: అటవీ సిబ్బందికి వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదల, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సీఓఓ కరణ్భల్లా తెలిపారు. ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన, కరణ్భల్లా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం ఉపాసన మీడియాతో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇటీవలే నల్లమల అడవుల్లో శిబిరాలు నిర్వహించామనీ, పదకొండు మంది మధుమేహ రోగులను గుర్తించామన్నారు. వారందరికీ అపోలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా 18 రాష్ట్రాల్లోని అటవీ గార్డులకు వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిర్ధరణ చికిత్స సేవలను అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి