దుబాయ్ లో వీసా తీసుకొని అమెరికా వెళ్లిన భారతీయ యువకుడు గుండెపోటుతో మృతి
- February 15, 2018
దుబాయ్ : కోటి ఆశలతో..ఎంచుకున్న మార్గంలో నడవాలని..ఎంతో ఉన్నత స్థితిలో తన కుటుంభాన్ని నిలపాలని అనుకున్న ఒక ప్రవాసియ భారతీయుని కలలు కల్లలు గానే మిగిలిపోయాయి..కొండంత ఆశతో అమెరికా వెళ్లి స్థిరపడాలని ఎంతో ఆశ పడిన ఆ యువకుని కోరికలు ఆవిరి అయ్యాయి..కానీ విధి రాతని ఎవరు మార్చలేరు.. అమెరికాకు వలస వెళ్ళే ఒక యువ భారతీయుడు, యుఎస్ వీసాతో స్టాంప్ చేసిన తన పాస్పోర్ట్ ను తీసుకొనే ముందు తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. టిలు మమ్మెన్ థామస్ (౩౩) , ఆయన భార్య ఫేబీ ఉన్నారు. పాస్స్పోర్టులని స్వీకరించిన తర్వాత దుబాయ్ లో ఒక పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద టిలు ఒక్కసారిగా కూలిపోయినట్లు బంధువులు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఒక ఫ్రెంచ్ సంస్థతో పనిచేసే ఇంజినీర్ టిలు మమ్మెన్ థామస్ తన కుటుంబాన్ని అమెరికాకు తరలించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. టిలు భార్య యొక్క కుటుంబ సభ్యులు అమెరికాలో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు - నాలుగు సంవత్సరాల ఇసాబెల్లా మరియు ఒకన్నర సంవత్సరాల వయస్సు గాబ్రియేల్ ఉన్నారు. తిల్లు మమ్మేన్ థామస్, 33, మరియు అతని భార్య ఫెబీ, దుబాయ్ పోస్ట్ ఆఫీస్ లో గుండె పోటుతో కుప్పకూలి చనిపోయాడు .దుబాయ్ మరియు షార్జాలోని మార్ థోమా చర్చ్ యొక్క అతని స్నేహితులు, సహచరులు మరియు సభ్యులతో సహా పలువురు వ్యక్తులు వైద్య ఫిట్నెస్ కేంద్రాల్లోని ఎమ్బలింగ్ కేంద్రంలో టిలు భౌతికకాయాన్ని కడసారిగా చూసేందుకు ఉంచారు. కాగా బుధవారం ఉదయం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో తన సొంత ఊరికి తిల్లు పార్దీవ దేహం పయనమయ్యింది. శుక్రవారం తన భార్య బంధువులు అమెరికా నుంచి కేరళాకు చేరుకున్న తరువాత రేపు శుక్రవారం తన అంత్యక్రియలు జరుపుతాయని బంధువులు చెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి