బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
- February 15, 2018
20 నెలల బాలిక, వాటర్ బకెట్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అల్ ధైద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ఆడుకుంటూ బాత్రూమ్లోకి వెళ్ళి అక్కడే, నీరు నిండి వున్న బకెట్లోకి దిగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి తండ్రి బయటకు వెళ్ళగా, ఇంట్లోనే వున్న తల్లి ఫోన్లో మాట్లాడుతూ వుంది. మరో చిన్నారి టీవీ చూస్తూ ఉన్నట్లు తల్లి చెప్పింది. ఫోన్లో మాట్లాడటం పూర్తయ్యాక, చిన్నారి కోసం వెతికిన తల్లికి బకెట్లో అచేతనావస్థలో పడిన చిన్నారి కన్పించింది. వెంటనే ఆ చిన్నారిని దగ్గరలో వున్న ఆసుపత్రికి తరలించారు. బకెట్లోకి దిగగానే చిన్నారి నీటిని ఎక్కువగా తాగేసిందనీ, ఆ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందడం జరిగిందనీ వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!









