సప్తగిరికోసం కథను రాస్తున్న 'బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్
- February 15, 2018
'బాహుబలి, భజరంగీ భారు జాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలందించి దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి చేసిన దాదాపు అన్ని సినిమాలకు ఈయనే కథల్ని అందించారు. ఈమధ్య పాపులర్ రచయిత రాజమౌళి చేసే సినిమాలకు మాత్రమే కాకుండా బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ రైటర్ కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తర్వాత సినిమాకు స్టోరి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









