సప్తగిరికోసం కథను రాస్తున్న 'బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్
- February 15, 2018
'బాహుబలి, భజరంగీ భారు జాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలందించి దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి చేసిన దాదాపు అన్ని సినిమాలకు ఈయనే కథల్ని అందించారు. ఈమధ్య పాపులర్ రచయిత రాజమౌళి చేసే సినిమాలకు మాత్రమే కాకుండా బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ రైటర్ కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తర్వాత సినిమాకు స్టోరి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







