సప్తగిరికోసం కథను రాస్తున్న 'బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్
- February 15, 2018
'బాహుబలి, భజరంగీ భారు జాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలందించి దేశవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి చేసిన దాదాపు అన్ని సినిమాలకు ఈయనే కథల్ని అందించారు. ఈమధ్య పాపులర్ రచయిత రాజమౌళి చేసే సినిమాలకు మాత్రమే కాకుండా బయటి సినిమాలకు కూడ కథల్ని అందిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించబోయే సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ రైటర్ కమెడియన్ నుండి హీరోగా మారిన సప్తగిరి తర్వాత సినిమాకు స్టోరి అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి స్వర్ణ సుబ్బారావ్ దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం