దుబాయ్ లో దుస్తుల మడతలలో మాదకద్రవ్యాలను దాచి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు
- February 15, 2018
దుబాయ్: ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడనే సమాచారంతో మాదకద్రవ్యాల వ్యతిరేక దుబాయ్ పోలీస్ విభాగం అరెస్టు చేసింది. తన సొంత దేశంలో నివసించే సోదరుడి సహకారంతో దుస్తుల మడతల్లో రహస్యంగా దాచిపెట్టి మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకొంటున్నట్లు యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఈద్ మహమ్మద్ థానీ హరిబ్ తెలిపారు. నిందితుడు ఉపయోగించిన అరుదైన పద్ధతి రహస్యతను కనుగొనడం అంత సులభం కాదని వాటిని దుస్తుల మడతలలో అత్యంత గోప్యంగా నిందితుడు దాచాడని చెప్పారు. "ఆపరేషన్ 'ఫోల్డ్' కింద, పోలీసులు హోటల్ వద్ద అరెస్టు చేశారు, ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి మాదక ద్రవ్యాలకు పంపిణీ చేయడానికి అక్కడ నిల్వచేశారు.ఆ మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసే వ్యక్తిని పట్టుకొనే ఆపరేషన్ విజయవంతమైనది. మేజర్ జనరల్ ప్రత్యక్ష ,ఖచ్చితమైన సమాచారం అందడంతో దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, మరియు నేర దర్యాప్తు విభాగం చీఫ్ అసిస్టెంట్ కమాండర్- ఇన్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్-మన్సోరి పర్యవేక్షణలో ఆ నిందితుడిని పట్టుకొన్నారు. ఆసియా దేశానికి చెందిన మాధకద్రవ్యాల రవాణా చేసే నిందితుడు దుబాయ్,ఇతర ఎమిరేట్స్ లో తన ప్రాంతాన్ని మాదకద్రవ్యాలతో లోడ్ చేస్తూ అనేక ప్రాంతాల్లోకి దాచడం జరిగింది. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం మాదకద్రవ్యాలు 283 కిలోలు మరియు 20 కిలల క్రిస్టల్ మెత్ కు అదనంగా మూడు రకాలైన మాదక ద్రవ్యాల మాత్రలు, సైకోట్రోపిక్ పదార్ధాలను స్వాధీనం చేసుకొని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు పంపించబడింది.
తాజా వార్తలు
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...







