ముంబయి రౌడీలతో ప్రభుదేవా పోరాట సన్నివేశాల్లో చార్లిచాప్లిన్2
- February 16, 2018
చెన్నై, న్యూస్టుడే: ప్రభుదేవా, ప్రభు నటిస్తున్న కొత్త చిత్రం 'చార్లి చాప్లిన్ 2'. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో కూడా ప్రభుదేవా, ప్రభు కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చాయి. వీటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. నిక్కీగల్రాణి కథానాయిక. ఆదా శర్మ రెండో కథానాయికగా నటిస్తున్నారు. రవి మరియా, ఆకాశ్, వివేక్ ప్రసన్న, కావ్యాలు ఇతర తారాగణం. అమ్మా క్రియేషన్స్ బ్యానరుపై టి.శివ నిర్మాణంలోని ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో గుర్తింపు పొందిన ఆదా శర్మ ఈ సినిమా ద్వారా కథానాయికగా తమిళంలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకుంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మార్చిలో పాటలను విడుదల చేయనున్నారు. ఈ చిత్రం గురించి శక్తి చిదంబరం మాట్లాడుతూ ఇది పూర్తిస్థాయి కమర్షియల్ కామెడీ సినిమా. ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది.
ఇటీవలే కుంభకోణంలో చిత్రీకరణ జరిపాం. 'మగధీర' ఫేమ్ దేవ్, ప్రభుదేవాల మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కించాం. ఇప్పుడు ముంబయి రౌడీలతో ప్రభుదేవా పోరాడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇందుకోసం రెండు పెద్ద సెట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి