షార్జాలో నేరస్తులు కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు
- February 17, 2018
షార్జా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...కుటుంబాలను కలపడం ఎంతో సంతోషం ఇస్తుందని పలువురు ఖైదీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంతో అకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత పశ్చాత్తపడి కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఉన్నా అవకాశం లేక చీకటి గదుల్లో కుమిలిపోయేవారు. ఇటువంటివారిని సానుభూతితో అర్ధం చేసుకొన్న షార్జా ప్రభుత్వం పలు నేరాలు చేసి జైలులో ఉండే ఖైదీలు వారి పిల్లలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల పిల్లలు, వారి ఆత్మీయులతో మాత్రమే మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సేవలను షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సేవల వల్ల పిల్లలు జైలు పరిసరాలను కూడా చూసే అవకాశం ఉండదని, కుటుంబ విలువలు మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. షార్జాలోని సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చెందిన 9 శాఖలలోఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. శిశు సంరక్షణ విభాగ సభ్యుడు అహ్మద్ అల్ టర్టొర్ తెలిపారు. షార్జా సిటీ, అల్ హమ్రియా, అల్ ధైడ్, అల్ బటేచ్, అల్ మదం, దిబబ్బాఅల్ హిస్న్, మలిహ, కల్బా, ఖోర్ ఫక్కాన్ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..







