షార్జాలో నేరస్తులు కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు
- February 17, 2018
షార్జా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...కుటుంబాలను కలపడం ఎంతో సంతోషం ఇస్తుందని పలువురు ఖైదీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంతో అకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత పశ్చాత్తపడి కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఉన్నా అవకాశం లేక చీకటి గదుల్లో కుమిలిపోయేవారు. ఇటువంటివారిని సానుభూతితో అర్ధం చేసుకొన్న షార్జా ప్రభుత్వం పలు నేరాలు చేసి జైలులో ఉండే ఖైదీలు వారి పిల్లలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల పిల్లలు, వారి ఆత్మీయులతో మాత్రమే మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సేవలను షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సేవల వల్ల పిల్లలు జైలు పరిసరాలను కూడా చూసే అవకాశం ఉండదని, కుటుంబ విలువలు మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. షార్జాలోని సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చెందిన 9 శాఖలలోఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. శిశు సంరక్షణ విభాగ సభ్యుడు అహ్మద్ అల్ టర్టొర్ తెలిపారు. షార్జా సిటీ, అల్ హమ్రియా, అల్ ధైడ్, అల్ బటేచ్, అల్ మదం, దిబబ్బాఅల్ హిస్న్, మలిహ, కల్బా, ఖోర్ ఫక్కాన్ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









