షార్జాలో నేరస్తులు కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చు
- February 17, 2018
షార్జా : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం...కుటుంబాలను కలపడం ఎంతో సంతోషం ఇస్తుందని పలువురు ఖైదీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంతో అకృత్యాలకు పాల్పడి ఆ తర్వాత పశ్చాత్తపడి కుటుంబసభ్యులతో మాట్లాడాలని ఉన్నా అవకాశం లేక చీకటి గదుల్లో కుమిలిపోయేవారు. ఇటువంటివారిని సానుభూతితో అర్ధం చేసుకొన్న షార్జా ప్రభుత్వం పలు నేరాలు చేసి జైలులో ఉండే ఖైదీలు వారి పిల్లలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఖైదీల పిల్లలు, వారి ఆత్మీయులతో మాత్రమే మాట్లాడే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సేవలను షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సేవల వల్ల పిల్లలు జైలు పరిసరాలను కూడా చూసే అవకాశం ఉండదని, కుటుంబ విలువలు మరింత పెరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. షార్జాలోని సోషల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు చెందిన 9 శాఖలలోఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. శిశు సంరక్షణ విభాగ సభ్యుడు అహ్మద్ అల్ టర్టొర్ తెలిపారు. షార్జా సిటీ, అల్ హమ్రియా, అల్ ధైడ్, అల్ బటేచ్, అల్ మదం, దిబబ్బాఅల్ హిస్న్, మలిహ, కల్బా, ఖోర్ ఫక్కాన్ ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







