జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ సదస్సుకు మినిస్టర్ కేటీఆర్కు ఆహ్వానం
- February 18, 2018
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి అరుదైన గౌరవం లభించింది. జర్మనీలో జరిగే జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జర్మనీలోని హంబర్గ్లో మార్చి 2న జరిగే సమావేశంలో తెలంగాణ అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కేటీఆర్ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలను తెలుసుకోవాలని జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తిగా ఉందని ఆహ్వానంలో పేర్కొన్నారు. తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై జర్మన్ సంస్థ ప్రత్యేకంగా ఆసక్తి వ్యక్తం చేయడం, సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







