జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ సదస్సుకు మినిస్టర్ కేటీఆర్కు ఆహ్వానం
- February 18, 2018
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి అరుదైన గౌరవం లభించింది. జర్మనీలో జరిగే జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జర్మనీలోని హంబర్గ్లో మార్చి 2న జరిగే సమావేశంలో తెలంగాణ అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కేటీఆర్ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలను తెలుసుకోవాలని జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తిగా ఉందని ఆహ్వానంలో పేర్కొన్నారు. తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై జర్మన్ సంస్థ ప్రత్యేకంగా ఆసక్తి వ్యక్తం చేయడం, సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి