జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ సదస్సుకు మినిస్టర్ కేటీఆర్కు ఆహ్వానం
- February 18, 2018
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ సంస్థ నుంచి అరుదైన గౌరవం లభించింది. జర్మనీలో జరిగే జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ అసోసియేషన్ 98వ సదస్సుకు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జర్మనీలోని హంబర్గ్లో మార్చి 2న జరిగే సమావేశంలో తెలంగాణ అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కేటీఆర్ను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న పలు సంక్షేమ, ఆర్థిక విధానాలను తెలుసుకోవాలని జర్మన్ వ్యాపార వర్గాలకు ఆసక్తిగా ఉందని ఆహ్వానంలో పేర్కొన్నారు. తెలంగాణ, జర్మనీ మధ్య వాణిజ్య బంధం మరింత విస్తృతమవుతుందని తెలిపారు. ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరున్న 300 మంది వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై జర్మన్ సంస్థ ప్రత్యేకంగా ఆసక్తి వ్యక్తం చేయడం, సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









