వదిలివేయబడిన 33 వాహనాలు అబూధాబిలో స్వాధీనం
- February 18, 2018అబుదాబి: నగరంలో చాలా కాలం నుండి యజమానులచేత వదిలివేయబడిన 33 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అబూధాబి సిటీ మున్సిపాలిటీ తెలిపింది. సిటీ మునిసిపల్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంట్రల్ ద్వారా నగరంలో ఒక తనిఖీని నిర్వహించారు. ఈ ప్రచారం అనేక ప్రాంతాలలో కొనసాగింది . రాజధానిలో దీర్ఘ కాలం పాటు గమనింపబడని వదిలివేసిన వాహనాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా. ఈ వాహనాలను స్వాధీనం చేసుకొని నగరానికి దూరంగా ఉన్న యార్డ్ వద్దకు తరలించారు. మున్సిపాలిటీ అబూధాబీలో 2012 చట్టం (2) నిబంధనల అమలులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు హెల్త్ అండ్ ట్రాంక్విలిటీని నిర్వర్తించడం కొనసాగుతాయని పేర్కొంది. ఈ చట్టం లోని నిబంధనల ప్రకారం 3,000 దిర్హామ్ జరిమానా నేరస్థులకు జారీ చేయబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది. ఇటువంటి ప్రచారాల ద్వారా, మునిసిపాలిటీ పబ్లిక్ ప్రాంతాలలో దీర్ఘకాలిక సౌకర్యాలలో వాహనాలను విడిచిపెట్టకుండా ప్రజలకు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ