ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి..
- February 18, 2018సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు 61 మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10 , 1956 విజయవాడలో జన్మించిన అయన సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హనుమంతరావు సినిమాల్లోకి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవారూ. ఆ తరువాత 18 ఏళ్ల వయసులో "రావణబ్రహ్మ" నాటకంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ నటించిన "అహనా నా పెళ్ళంటా" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాజేంద్రప్రసాద్ తో యమలీల , కొబ్బరిబోండం, రాజేంద్రుడు గజేంద్రుడు , వంటి హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర సంచలన కామెడీ సీరియల్ "అమృతంలో" ఆంజనేయులుగా నటించారు. కాగా గుండు హనుమంతరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ