అమరావతి రైతుల సింగపూర్ టూర్
- February 18, 2018అమరావతి: సింగపూర్ అభివృద్ధి విశేషాలను తెలుసుకునేందుకు సీఆర్డీయే ఆధ్వర్యంలో రాజధాని రైతుల మూడో బృందం ఆదివారం ఆ దేశ పర్యటనకు బయలుదేరింది. మొత్తం 39 మంది రైతులు వెలగపూడి సచివాలయం నుంచి బస్సులో గన్నవరం ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23న వారు పర్యటన ముగించుకుని తిరిగి వస్తారు. పర్యటనలో అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, మందడం, నేలపాడు, నిడమర్రు, పెనుమాక, తుళ్లూరు, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. వీరికి, సింగపూర్ అధికారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించేందుకు సీఆర్డీయే అధికారులు కూడా రైతులతో పాటు వెళ్లారు. ఇప్పటికే రెండు విడతలుగా 64మంది రైతులు సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. సింగపూర్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందేలా రైతులు తోడ్పాటునందించేందుకు సీఆర్డీయే ఈ పర్యటనలు ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత