ఏషియన్ రెస్టారెంట్లో వ్యక్తి హత్య
- February 19, 2018
33 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఆసియన్ రెస్టారెంట్లో హత్యకు గురయ్యాడు. నహ్దా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏషియన్ రెస్టారెంట్లో పాకిస్తానీ వ్యక్తిని పలుమార్లుప పొడిచి చంపారు. మృతుడ్ని ఎంఎ ఖాన్గా గుర్తించాఉ. కిచెన్ నైఫ్తో అతన్ని చంపేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుండగా, వారి మధ్య తగాదా ప్రారంభమయ్యిందనీ, ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, మృతుడ్ని బలంగా పొడిచాడని తెలియవస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఫోరెన్సిక్, సీఐడీ, క్రైమ్ సీన్, పెట్రోల్, అంబులెన్స్ విభాగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. రెస్టారెంట్లో ఉన్నవారిని విచారించి, వివరాల్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్పై ఖచ్చితమైన సమాచారం లేదు.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









