మంచినీళ్ల బాటిల్ తో మత్తు పదార్ధాలను రహస్య సంకేతాలతో విక్రయిస్తున్న ఆసియా దేశ నిందితులు..
- February 19, 2018
షార్జా : నీళ్ల బాటిళ్లతో పోలీసుల కళ్ళు కప్పాలని చూశారా నిందితులు..కానీ అడ్డంగా దొరికిపోయారు. మత్తు కల్గించే పదార్ధాలు విక్రయిస్తే దారుణమైన శిక్షలు ఆ దేశాలలో ఉంటాయని స్పష్టంగా తెల్సినప్పటకి కొందరు డబ్బు మోజులో పడి ప్రాణాలకు తెగించి అక్రమ రవాణా చేయబోయి అధికారులకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు జీవనోపాధి కోసం యూఏఈ వెళ్లారు. అడ్డదారిలో అధిక డబ్బు సంపాదించాలనే కక్కుర్తితో మాధకద్రవ్యాల అక్రమరవాణాకు పాల్పడ్డారు. మాధకద్రవ్యాల రవాణా చేయడంతోపాటు వారి ఇంట్లోనే ఆ మత్తు పదార్ధాలను రహస్యంగా నిల్వ చేశారు. డ్రగ్స్ అమ్మకానికి పాల్పడ్డారు. తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. డ్రగ్స్ అక్రమరవాణాకు నిందితులు ఉపయోగించిన రహస్య సాంకేతిక బాష పోలీసులు వెల్లడించారు. వాటర్ బాటిల్ను చేతితో పట్టుకున్న వ్యక్తి వద్ద మాదకద్రవ్యాలు విక్రయిస్తాడు. మత్తు పదార్ధాలు కొనుక్కోవాలనే వ్యక్తి కూడా వాటర్ బాటిల్ చేతపట్టుకుని ఉండాలి. ఎవరికీ అనుమానం రాకుండా, ఎలాంటి సంభాషణా లేకుండా ఈ కోడ్ భాషను ఉపయోగించేవారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పూర్తిగా సమాచారం అందుకున్న తర్వాతే నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







