33 వీసా అప్లికేషన్ల ఫోర్జరీ: నిందితుడికి 3 ఏళ్ళ జైలు
- February 19, 2018
దోహా:33 వీసా అప్లికేషన్లను ఫోర్జరీ చేసిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. బిజినెస్ ఓనర్ (బాధితుడి) సిగ్నేచర్ని సేకరించి, వీసాల్ని జారీ చేసేందుకోసం దాన్ని నిందితుడు దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలింది. తాను పనిచేసిన సంస్థ తాలూకు వివరాల్ని, యజమాని వివరాల్ని చాకచక్యంగా దొంగిలించి, వాటితో అప్లికేషన్లను ఫోర్జరీ చేశాడు. ఏడాది కాలంలో 600 వీసాల్ని ప్రాసెస్ చేయగా, ఇందులో 33 ఫోర్జరీవని అధికారులు విచారణలో నిర్ధారించారు. ఫోర్జరీ గురించి తెలియగానే యజమాని పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగులోఎయకి వచ్చింది. 3 ఏళ్ళ జైలు శిక్ష అనంతరం, నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందిగా కూడా కోర్టు తీర్పులో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









