ఐఎస్లో చేరిన టర్కీ మహిళకు ఇరాక్లో మరణశిక్ష
- February 19, 2018
బాగ్దాద్ : ఐఎస్లో చేరిన టర్కీ మహిళను ఇరాక్లోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఉగ్రసంస్థలకు మద్దతు తెలపడం, ఉగ్రసంస్థల్లో చేరడం లేదా చేర్పించడం చట్ట ప్రకారం పెద్ద నేరంగా పరిగణిస్తామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా, ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందిన మరో 10 మంది విదేశీ మహిళలకు జీవితఖైదు విధించినట్టు వెల్లడించారు. తాము వెలువరించిన తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు జడ్జీ తెలిపారు. ఉగ్రసంస్థల పట్ల ఆకర్షితులవుతున్న యువత పెద్ద సంఖ్యలో ఐఎస్లో చేరుతున్నారు. సిరియా, ఇరాక్ దేశాలకు వెళ్లి ఉగ్రశిబిరాల్లో చేరుతున్నారు. దీంతో, ఉగ్రసంస్థలను నియంత్రించే దిశగా ఇరాక్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాదులను విచారించి సమాచారం రాబట్టుతున్నది. దోషులుగా తేలిన మిలిటంట్లను శిక్షిస్తున్నది. ఇరాక్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ జర్మనీకి చెందిన ఓ మహిళకు గతనెలలో ఉరిశిక్ష విధించినట్టు ఇరాక్ ప్రభుత్వం పేర్కొన్నది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







