ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో సోఫియా రోబో ప్రసంగం
- February 19, 2018
హైదరాబాద్: ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు రెండోరోజుకు చేరుకుంది. ఈ సదస్సులో సోఫియా రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అనే అంశంపై ఈ ఆడ రోబో ప్రత్యేక ప్రసంగం చేయనుంది. ప్రపంచంలోనే ఓ దేశ పౌరసత్వం ఉన్న ఏకైక రోబో ఇది. అలాగే నేటి సదస్సులో కృత్రిమ మేథస్సు, నూతన టెక్నాలజీపై చర్చించనున్నారు. నాస్కామ్, విట్సా, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా మూడు రోజులపాటు హైదరాబాద్లో నిర్వహిస్తున్న 22వ ప్రపంచ ఐటీ సదస్సును (డబ్ల్యూఐసీటీ) సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
భవిష్యత్తుకు కీలకంగా గుర్తించిన ఎనిమిది కొత్త టెక్నాలజీల్లో శిక్షణకు నాస్కామ్ రూపొందించిన ఫ్యూచర్ స్కిల్స్ వేదికను కూడా ప్రధాని ప్రారంభించారు. తొలిసారిగా భారత్లో ఈ సదస్సును నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ''డిజిటల్ యుగంలో ప్రపంచం త్వరితగతిన పురోగమిస్తోంది. ఈ తరుణంలో డిజిటల్ పరివర్తనకు నాస్కామ్ ఎంపిక చేసిన ఎనిమిది నైపుణ్యాలు కీలకమన్నారు. నిన్నటి సదస్సులో కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీ ఫైబర్గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్తో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి