సమంత 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది.
- February 19, 2018
సమంత కమర్షియల్ సినిమాలతోనే తనదైన ముద్ర వేసింది. నటిగా తనేంటో రుజువు చేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మాత్రం చేయలేదు. కన్నడలో రెండేళ్ల కిందట వచ్చిన 'యు టర్న్' సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన సామ్.. ఆ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది సామ్.
ఎట్టకేలకు 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ మొదలవడం విశేషం. శనివారమే చిత్రీకరణ ఆరంభించారు. సమంత రాజమండ్రికి వచ్చిన విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తన కోసం ఫ్యాన్స్ తహతహలాడిపోతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'యు టర్న్' చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది సామ్. కన్నడలో 'యు టర్న్' తీసిన పవన్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీస్తన్నారు.
సమంత ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతోంది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న సినిమా.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







