సమంత 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది.
- February 19, 2018
సమంత కమర్షియల్ సినిమాలతోనే తనదైన ముద్ర వేసింది. నటిగా తనేంటో రుజువు చేసుకుంది. కానీ ఇప్పటిదాకా ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా మాత్రం చేయలేదు. కన్నడలో రెండేళ్ల కిందట వచ్చిన 'యు టర్న్' సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన సామ్.. ఆ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ మధ్యే ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది సామ్.
ఎట్టకేలకు 'యు టర్న్' రీమేక్ పట్టాలెక్కింది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ మొదలవడం విశేషం. శనివారమే చిత్రీకరణ ఆరంభించారు. సమంత రాజమండ్రికి వచ్చిన విషయం తెలుసుకుని అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తన కోసం ఫ్యాన్స్ తహతహలాడిపోతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'యు టర్న్' చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది సామ్. కన్నడలో 'యు టర్న్' తీసిన పవన్ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తీస్తన్నారు.
సమంత ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతోంది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న సినిమా.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి