భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ దూరం, క్రికెట్ అభిమానులకు చేదువార్త!
- February 19, 2018
టీమిండియా క్రికెట్ అభిమానులకు చేదువార్త ఎదురవబోతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లను వన్డే సిరీస్ లో ఓడించి t20 సిరీస్ కైవసం దిశగా అడుగులు వేస్తుంది టీమిండియా. ఆదివారం జరిగిన మొదటి t20 లో భారత్ శుభారంభాన్నిచ్చింది. ఆ మ్యాచ్ లో భారత్ క్రికెట్ రధసారధి విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. దీంతో బుధవారం జరిగే రెండవ t20 కి కోహ్లీ ఆడటం అనుమానమేనన్న భావన వ్యక్తం చేస్తున్నారు జట్టు ఆటగాళ్లు. ఈ క్రమంలో వచ్చే రెండు నెలల్లో కీలక సిరీస్ ను ఎదుర్కోవాలి కనుక ప్రస్తుతం కోహ్లీకి సాధ్యమయినంత ఫిట్నెస్ అవసరం. గాయపడ్డ కోహ్లీ బుధవారం మ్యాచ్ ఆడితే గాయం మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. దాంతో వచ్చే సిరీస్ లో పాల్గొనటం కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ రెండవ t20 కి దూరంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఒకవేళ కోహ్లీ మ్యాచ్ కు దూరంగా ఉన్నట్టయితే జట్టు పగ్గాలు రోహిత్ శర్మకు అప్పగించే అవకాశముంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







