సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో .. 94 మంది మృతి
- February 19, 2018
డమస్కస్: సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో 94 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. డమస్కస్కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సిరియా ప్రభుత్వ దళాలు ఈ దాడులు చేసినట్లు తెలుస్తున్నది. సిరియా ఆర్మీ కూడా ఉగ్ర స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. 2013 నుంచి ఈస్ట్రన్ గౌటా మిలిటెంట్ల ఆధీనంలో ఉన్నది. అక్కడ సుమారు 4 లక్షల మంది జీవిస్తున్నారు. డమస్కస్ సమీపంలో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ఏకైక ప్రాంతం అది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







