రూమర్స్కు చెక్ : 'సైరా' సెట్లో అమితాబచ్చన్
- February 20, 2018
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో పరభాషా నటులు కూడా చాలా మంది కనిపించనున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడంటూ చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుంచి అమితాబ్ తప్పుకున్నాడన్న వార్తలు వినిపించాయి.
ఇప్పటికే సినిమాటోగ్రాఫర్తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో బిగ్ బి కూడా తప్పకున్నారన్న వార్తలు మరింతగా వినిపించాయి. అయితే ఈ రూమర్స్కు చెక్ పెడుతూ సైరా షూటింగ్లో బిగ్ బి పాల్గొంటున్నారు. ఈ మేరకు అమితాబ్తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమాలో అమితాబ్ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనింపించనున్నారు. చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి