'ప్రెసిడెంట్స్ డే'ను జరుపుకుంటున్న అమెరికా
- February 20, 2018
వాషింగ్టన్ : 'ప్రెసిడెంట్స్ డే' ను అమెరికా మంగళవారం జరుపుకుంటోంది. అమెరికా ప్రధమ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ (1732-1799) జన్మదినమైన ఈరోజున ప్రభుత్వ సంస్థలకు, స్కూళ్ళకు, బ్యాంకులకు అన్నిటికీ శలవు. అయితే తప్పనిసరిగా పాటించాలనేమీ లేదు. వాస్తవానికి వాషింగ్టన్ జన్మించింది ఫిబ్రవరి 22, మరణించింది కూడా 22నే. దాంతో దేశవ్యాప్తంగా ఈ రోజును ప్రెసిడెంట్స్ డే గా పాటించాలని నిర్ణయించారు. 1960వ దశకంలో యూనిఫారం మండే హాలిడే యాక్ట్ను కాంగ్రెస్ ఆమోదించింది. అంటే అన్ని ప్రభుత్వ శలవు దినాలు సోమవారమే వుండాలని నిర్ణయించారు. ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజులు శలవు దినాలు కలిసి వచ్చాయని భావించి దాన్ని అమలు చేసారు. దేశానికి ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షులందరినీ స్మరించుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







