నిత్యా మీనన్ మరో వినూత్నమూవీ 'ప్రాణ'..
- February 21, 2018
నిత్యా మీనన్ మరో వినూత్న చిత్రంలో నటించింది.. ఈ మూవీ మొత్తం ఒకే ఒక్క పాత్ర ఉండటం విశేషం.. ప్రాణ పేరుతో ఈ చిత్రాన్ని మలయాళ, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వి.కె. ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, ప్రముఖ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్, నిత్యామీనన్ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సౌండ్ డిజైనింగ్ ఈ సినిమా ప్రత్యేకతని చెబుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఈ సినిమా కోసం 'సరౌండ్ సింక్ సౌండ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్నారు. డబ్బింగ్ అనేది లేకుండగా షూటింగ్ సమయంలోనే డైలాగ్స్ రికార్డు అవుతాయని అంటున్నారు. "నాలుగు భాషల్లో రూపొందుతున్నందు వలన ఒక్కోసారి ఒక్కో భాషలో డైలాగ్ చెప్పాల్సి వచ్చింది .. కష్టమే అయినా తప్పలేదు" అని తాజా ఇంటర్వ్యూలో నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. ఈ మూవీ అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుందనే ధీమాను వ్యక్తం చేసింది నిత్యా..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి